Header Banner

పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

  Wed May 21, 2025 12:45        Politics

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిన ఏకైక వ్యక్తిగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు, యోగాకు సంబంధించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యోగా కొన్ని ప్రాంతాలకో, కొంతమందికో పరిమితం కాకుండా అందరి జీవనశైలిలో భాగం కావాలన్నారు. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా తప్పనిసరి అని పేర్కొన్నారు. ‘‘ఫొటోలు దిగేందుకు, ఈవెంట్‌ కోసం ఒక రోజు నిర్వహించే కార్యక్రమం కాదు ఇది. ప్రతి ఒక్కరిలో ప్రగాఢ మార్పు తీసుకురావాల్సిన కార్యక్రమం’’ అని అన్నారు.

ఈ నేపథ్యంలో యోగాంధ్ర-2025 కార్యక్రమాన్ని ఇవాళ నుంచి నెలరోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కనీసం రెండు కోట్ల మంది పాల్గొనాలన్నదే సంకల్పంగా పేర్కొన్నారు. అంతేకాక, పది లక్షల మందికిపైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. వచ్చే నెల 21న విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరవుతారని వెల్లడించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు యోగా నిర్వహిస్తామన్నారు.

పాఠశాలల్లోనూ ఇకనుంచి రోజు ఒక గంట యోగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ‘‘ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం చేస్తే ఒత్తిడి ఉండదు. రికార్డులు తిరగరాసేలా యోగా జరిపిద్దాం’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #YogaAndhra2025 #YogaInSchools #APGovernment #DailyYoga #StudentWellbeing